నేటి నుంచి పట్టాలెక్కనున్న ఎంఎంటీఎస్ రైళ్లు

ABN , First Publish Date - 2021-06-23T12:18:55+05:30 IST

కరోనా కారణంగా నిలిచిపోయిన ఎంఎంటీఎస్ రైళ్లు దాదాపు 15 నెలల తరువాత ఈరోజు పట్టాలెక్కనున్నాయి.

నేటి నుంచి పట్టాలెక్కనున్న ఎంఎంటీఎస్ రైళ్లు

హైదరాబాద్: కరోనా కారణంగా నిలిచిపోయిన ఎంఎంటీఎస్ రైళ్లు దాదాపు 15 నెలల తరువాత ఈరోజు పట్టాలెక్కనున్నాయి. 121 సర్వీసులకు ప్రస్తుతం 10 సర్వీసులకు మాత్రమే అనుమతి ఇచ్చారు. పరిస్థితి అదుపులో ఉంటే జులై ఒకటి నుండి మరో యాబై సర్వీసులను నడపేందుకు దక్షిణమధ్య రైల్వే ప్రణాళికను సిద్ధంచేసింది. ప్రతిరోజు 121 ఎంఎంటీఎస్ రైళ్ల సర్వీసుల ద్వారా 1.65 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందించింది. కరోనా కారణంగా ఎంఎంటీఎస్ రైళ్లను నిలిపివేయడంతో  దాదాపు నలబై కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. 

Updated Date - 2021-06-23T12:18:55+05:30 IST