ఆయన వియ్యంకులే తయారు చేస్తున్నారు : మంత్రి అనిల్
ABN , First Publish Date - 2021-05-13T00:51:22+05:30 IST
రాష్ట్రంలో 15 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ కొరత ఉందని, ఆ కొరతను అధిగమించడానికి అన్ని విధాలా చర్యలు
నెల్లూరు : రాష్ట్రంలో 15 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ కొరత ఉందని, ఆ కొరతను అధిగమించడానికి అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి అనిల్ కుమార్ ప్రకటించారు. రాష్ట్రంలో 80,000 కోట్లను సంక్షేమానికి ఖర్చు చేస్తున్నామని, వ్యాక్సినేషన్ కోసం 1600 కోట్లను ఖర్చు చేయమా? అని సూటిగా ప్రశ్నించారు. రామోజీ వియ్యంకులు వ్యాక్సిన్ తయారు చేస్తున్నారని, చంద్రబాబు ముందుకు రావాలని, ముందుకు వచ్చి వ్యాక్సిన్లు ఇప్పిస్తే కొనుగోలుకు సిద్ధమని ఆయన ప్రకటించారు. రెండు మూడు రోజులు రెమిడేసివిర్ వంటి వాటిని బ్లాక్ మార్కెట్లో అమ్మిన మాట వాస్తవమేనని, ప్రస్తుతం అన్ని హాస్పిటల్స్లో అందుబాటులోకి తెచ్చామని మంత్రి తెలిపారు. తప్పులు జరుగుతుంటే చెప్పాలని, సరిదిద్దుకోవడానికి తాము సదా సిద్ధంగానే ఉన్నామని అనిల్ స్పష్టం చేశారు.