8 న అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో మోదీ వీడియో కాన్ఫరెన్స్

ABN , First Publish Date - 2020-04-05T20:28:55+05:30 IST

కరోనా విజృంభణ, దేశవ్యాప్త లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 8 న అన్ని పార్టీల ఫ్లోర్‌లీడర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ నెల

8 న అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో మోదీ వీడియో కాన్ఫరెన్స్

న్యూఢిల్లీ : కరోనా విజృంభణ, దేశవ్యాప్త లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 8 న అన్ని పార్టీల ఫ్లోర్‌లీడర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ నెల 8 న ఉదయం 11 గంటలకు ఐదుగురు ఎంపీల కంటే ఎక్కువ సంఖ్య ఉన్న అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమవుతారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకటించారు. అయితే లాక్‌డౌన్ విషయంపైనే మోదీ చర్చించనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఇదే విషయంపై ప్రధాని మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూడా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో కూడా లాక్‌డౌన్ విషయంపైనే ప్రధానంగా చర్చ జరిగింది. 

Updated Date - 2020-04-05T20:28:55+05:30 IST