ప్రధాని Modi కోసం కాశీలో ప్రత్యేక పూజలు

ABN , First Publish Date - 2021-11-28T17:28:23+05:30 IST

ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని తమిళనాడులో ‘ఇంటింటికీ వెళ్దాం... మనసులు దోచుకుందాం’ పేరిట కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా మూడవ విడతగా స్థానిక థౌజండ్‌ లైట్స్‌

ప్రధాని Modi కోసం కాశీలో ప్రత్యేక పూజలు

ప్యారీస్‌(చెన్నై): ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని తమిళనాడులో ‘ఇంటింటికీ వెళ్దాం... మనసులు దోచుకుందాం’ పేరిట కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా మూడవ విడతగా స్థానిక థౌజండ్‌ లైట్స్‌ ప్రాంతం నుంచి వెళ్లిన 71 మంది భక్తుల బృందం శనివారం ఉదయం గంగా నది తీరంలో ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించింది. కాశి యాత్ర ఏర్పాట్లను గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ మాజీ జోన్‌ ఛైర్మెన్‌, హైకోర్టు సీనియర్‌ న్యాయవాది వి. గిరినాథ్‌ చేపట్టడంతో పాటు కాశి క్షేత్రంలో మోదీ జన్మదిన వేడుకల్లో కూడా పాల్గొన్నారు. కేదార్‌నాథ్‌ ఘాట్‌, గంగా నదిలో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం కాశి విశ్వనాథ ఆలయంలో మోదీ పేరుతో ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అదే విధంగా ఆ క్షేత్రంలో కొలువుదీరిన కాలభైరవుడికి మహా జన్మాష్టమి సందర్భంగా సుగంధద్రవ్యాలతో అభిషేకపూజలు నిర్వహించారు. ఈ పూజల్లో ఉత్తరప్రదేశ్‌ బీజేపీ అధికార ప్రతినిధి ఉమే్‌షసింగ్‌, రైల్వే శాఖ మాజీ జనరల్‌ మేనేజర్‌ రాంజీ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో గిరినాథ్‌ మాట్లాడుతూ... దృఢమైన, స్థిరమైన మనస్సుతో, నియమనిష్టలతో మోక్షసాధనకు ప్రయత్నం చేయాలని సూచించారు. కాశి, రామేశ్వరం వంటి పుణ్యక్షేత్రాలను సందర్శించడం కూడా భగవంతుడి కృప అని, ఆధ్యాత్మికత భయాన్ని పోగొడుతుందని గిరినాథ్‌ తెలిపారు.

Updated Date - 2021-11-28T17:28:23+05:30 IST