ప్రధానిగా మోదీ కొత్త రికార్డు
ABN , First Publish Date - 2020-08-14T07:03:21+05:30 IST
అత్యధిక కాలం పదవిలో ఉన్న కాంగ్రేసేతర ప్రధానిగా నరేంద్ర మోదీ రికార్డు సృష్టించారు. ఈక్రమంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయీని అధిగమించారు...
న్యూఢిల్లీ, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): అత్యధిక కాలం పదవిలో ఉన్న కాంగ్రేసేతర ప్రధానిగా నరేంద్ర మోదీ రికార్డు సృష్టించారు. ఈక్రమంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయీని అధిగమించారు. వాజపేయీ ప్రధానిగా అన్ని పర్యాయాలూ కలుపుకొని 2268రోజు లు ప్రధానిగా ఉండగా.. మోదీ గురువారంతో ఈ రికార్డును అధిగమించారు. బీజేపీ సోషల్ మీడియా జాతీయ విభాగం ఇన్చార్జి ప్రీతి గాంధీ ఈ విషయాన్ని ట్వీట్ చేశారు. ఇక మొత్తం ప్రధానమంత్రుల్లో సుదీర్ఘకాలం పదవిలో ఉన్న వారిలో ఆయన నాలుగో స్థానానికి చేరారు. తొలి మూడు స్థానాల్లో జవహర్లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, డా. మన్మోహన్ సింగ్ ఉన్నారు. నెహ్రూ 16ఏళ్లపాటు, ఇందిర 15ఏళ్ల పాటు, మన్మోహన్ పదేళ్ల పాటు ప్రధానులుగా పనిచేశారు.