చెరువులో మునిగిన సెల్టవర్ పరికరాలు
ABN , First Publish Date - 2020-10-25T10:59:04+05:30 IST
అర్థవీడు మండలం మొహిద్ధీన్పురం గ్రామ సమీపంలో ఏర్పాటు చేసిన ఒక సెల్టవర్, వాటికి సంబంధించిన విద్యుత్ పరికరాలు కంభం చెరువులో నీట మునిగాయి.
సిగ్నెల్స్ లేక వినియోగదారుల ఇక్కట్లు
కంభం (అర్థవీడు), అక్టోబరు 24 : అర్థవీడు మండలం మొహిద్ధీన్పురం గ్రామ సమీపంలో ఏర్పాటు చేసిన ఒక సెల్టవర్, వాటికి సంబంధించిన విద్యుత్ పరికరాలు కంభం చెరువులో నీట మునిగాయి. దీంతో సెల్టవర్ నుంచి మండలంలోని సెల్ ఫోన్లకు సిగ్నల్స్ ఆగిపోయాయి. కంభం చెరువుకు 21 అడుగులమేర నీరు చేరడంతో చెరువు పరిధిలో నిర్మించిన టవర్లు, విద్యుత్ పరికరాలు నాలుగు రోజులుగా నీటిలోనే ఉన్నాయి. దీంతో మండలంలో ఆ కంపెనీకి సంబంధించిన మొబైల్ ఫోన్లు పనిచేయక వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. ఆ సంస్థ సిబ్బంది సిగ్నెల్స్ అందే విధంగా ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలని ప్రజలు కోరుతున్నారు.