ఖాతాలో డబ్బులు మాయం

ABN , First Publish Date - 2021-03-20T22:09:52+05:30 IST

బ్యాంకులోని ఓ ఖాతాదారుడి నుంచి రూ.3 లక్షలు మాయ

ఖాతాలో డబ్బులు మాయం

తూర్పు గోదావరి: బ్యాంకులోని ఓ ఖాతాదారుడి అకౌంట్ నుంచి  రూ.3 లక్షలు మాయమయ్యాయి. ఆర్యాపురం కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకులో వేలూరి శామ్యూల్ అనే వ్యక్తికి ఖాతా ఉంది. తన ఖాతాలో లక్షల రూపాయల డబ్బులు ఉన్నాయి. ఆ డబ్బులను డ్రా చేసుకోవడానికి బ్యాంకుకి వెళ్లాడు. అయితే శామ్యూల్ ఖాతా నుంచి రూ.3 లక్షలు మాయమయినట్లు బ్యాంకు అధికారులు గుర్తించారు. ఖాతాదారుని సంతకాన్ని ఫోర్జరీ చేసి అకౌంట్‌ నుంచి డబ్బు డ్రా చేసినట్టు బ్యాంకు అధికారులు గుర్తించారు. పోలీసులకు బ్యాంకు అధికారులు, ఖాతాదారుడు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-03-20T22:09:52+05:30 IST