డ్రోన్‌ కెమెరాలతో కర్ఫ్యూ ఆంక్షల పర్యవేక్షణ

ABN , First Publish Date - 2021-05-11T06:39:30+05:30 IST

నగరంలో కర్ఫ్యూ ఆంక్షలను జిల్లా పోలీసు యంత్రాంగం మరింత కఠినంగా అమలు చేసింది. ఇందులో భాగంగా సోమవారం డ్రోన్‌ కెమెరాలతో క ర్ఫ్యూ ఆంక్షలను పర్యవేక్షిం చి, ఎక్కడికక్కడ ఉల్లంఘనదారులను చెల్లాచెదురు చేశారు.

డ్రోన్‌ కెమెరాలతో కర్ఫ్యూ ఆంక్షల పర్యవేక్షణ
టవర్‌క్లాక్‌ వద్ద పరిస్థితిని డ్రోన్‌తో సమీక్షిస్తున్న దృశ్యం

 అనంతపురం క్రైం, మే10: నగరంలో కర్ఫ్యూ ఆంక్షలను జిల్లా పోలీసు యంత్రాంగం మరింత కఠినంగా అమలు చేసింది. ఇందులో భాగంగా సోమవారం డ్రోన్‌ కెమెరాలతో క ర్ఫ్యూ ఆంక్షలను పర్యవేక్షిం చి, ఎక్కడికక్కడ ఉల్లంఘనదారులను చెల్లాచెదురు చేశారు. అనవసరంగా బ యటకు వచ్చిన వాహనచోదకులకు జరిమానాలు విధించడంతోపాటు కౌన్సెలింగ్‌ చేశారు. నగరంలోని 1, 2, 3, 4వ పట్టణ పోలీసులు బృందాలుగా ఏర్పడి, కర్ఫ్యూ ఆంక్షలను మరింత కట్టుదిట్టం చేయడంతో నగర వీధులు, రోడ్లు నిర్మానుషంగా మారాయి.  నగరంలోని పలు వీధులు కర్ఫ్యూ సడలింపు సమయంలో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జనాలతో కిక్కిరిసిపోయాయి. గంటల తరబడి ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పడింది. దీంతో నగర ప్రజలు, వాహనచోదకులు ఎండలోనే నిరీక్షించాల్సిన దుస్థితి నెలకొంది.


Updated Date - 2021-05-11T06:39:30+05:30 IST