రెండు వారాల ముందే మూడు రాష్ట్రాలను తాకిన రుతుపవనాలు
ABN , First Publish Date - 2021-06-14T01:09:10+05:30 IST
నైరుతి రుతుపవనాలు 15 రోజుల ముందే నేడు ఉత్తరాఖండ్, హిమాచల్ప్రదేశ్, జమ్మూకశ్మీర్, లడఖ్తోపాటు
న్యూఢిల్లీ: నైరుతి రుతుపవనాలు 15 రోజుల ముందే నేడు ఉత్తరాఖండ్, హిమాచల్ప్రదేశ్, జమ్మూకశ్మీర్, లడఖ్తోపాటు ఉత్తర హర్యానా, చండీగఢ్, ఉత్తర పంజాబ్లోని పలు ప్రాంతాలను తాకాయి. భారత వాతావరణ శాఖ ప్రకారం..ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్, లడఖ్, గిల్గిత్ బాల్టిస్థాన్, ముజఫరాబాద్తోపాటు ఉత్తర హర్యానా, చండీగడ్, ఉత్తర పంజాబ్లలో నేడు సీజనల్ వర్షాలు కురిశాయి. మున్ముందు మధ్య ప్రదేశ్తోపాటు తూర్పు ఉత్తరప్రదేశ్లోని మిగతా ప్రాంతాలు, ఢిల్లీ, పశ్చిమ ఉత్తర ప్రదేశ్, హర్యానా, పంజాబ్లలోని మిగతా ప్రాంతాలను వచ్చే 48 గంటల్లో రుతుపవనాలు తాకేందుకు పరిస్థితులు అనువుగా ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. సాధారణంగా ఢిల్లీలో జూన్ 28-29 మధ్య రుతుపవనాలు తాకుతాయి. ఉత్తర బంగాళాఖాతం మీదుగా అల్పపీడనం ఏర్పడడం రుతుపవన పురోగతికి అనకూల పరిస్థితులను సృష్టించినట్టు నిపుణులు చెబుతున్నారు.