అచ్చెన్న అవినీతికి పాల్పడలేదని ఒక్కరూ చెప్పట్లేదు: మోపిదేవి

ABN , First Publish Date - 2020-07-02T15:53:17+05:30 IST

తిరుమల: బీసీలను టీడీపీ ట్రంప్ కార్డుగా వాడుకుంటోందని వైసీపీ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ విమర్శించారు.

అచ్చెన్న అవినీతికి పాల్పడలేదని ఒక్కరూ చెప్పట్లేదు: మోపిదేవి

తిరుమల: బీసీలను టీడీపీ ట్రంప్ కార్డుగా వాడుకుంటోందని వైసీపీ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ విమర్శించారు. ఎన్నికైన అనంతరం శ్రీవారి దర్శనానికి నిన్న సాయంత్రం మోపిదేవి తిరుమలకు వచ్చారు. అచ్చెన్నాయుడు అవినితికి పాల్పడలేదని ఒక్క టీడీపీ నాయకుడు చెప్పడం లేదన్నారు. అరెస్ట్‌పై మాత్రం విమర్శలు చేస్తున్నారన్నారు.


అవినీతికి పాల్పడితే అచ్చెం అయినా... చంద్రబాబైన అరెస్ట్ కాక తప్పదని మోపిదేవి పేర్కొన్నారు. బీసీలు అభివృద్ధికి చిత్తశుద్దితో కృషి చేస్తున్న వ్యక్తి జగన్ మాత్రమేనన్నారు. నాలుగు రాజ్యసభ సీట్లలో రెండు బీసీలకు కేటాయించారన్నారు. బీసీలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి సాధించేలా జగన్ పరిపాలన చేస్తున్నారని మోపిదేవి వెంకటరమణ పేర్కొన్నారు.


Updated Date - 2020-07-02T15:53:17+05:30 IST