తమిళనాడు కోలుకునేనా.. నేడు కూడా 4వేలకు పైగా..
ABN , First Publish Date - 2020-07-14T00:06:51+05:30 IST
తమిళనాడులో కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ మధ్య కాలంలో...
చెన్నై: తమిళనాడులో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ మధ్య కాలంలో ప్రతి రోజూ దాదాపు 4వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. తాజా కేసులతో కలుపుకొని మొత్తం కేసుల సంఖ్య లక్షా43వేలకు చేరువైంది. అధికారిక లెక్కల ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 4,328 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 66 మంది మరణించారు. 3,035 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా నమోదైన కేసులతో కలుపుకొని రాష్ట్రంలోని మొత్తం కేసుల సంఖ్య 1,42,798కి చేరింది. వీరిలో 48,196మంది చికిత్స పొందుతుండగా 92,567మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కాగా 2,032మంది మృత్యువాతపడ్డారు.