కరోనా రిపోర్ట్: అస్సాంలో కొత్తగా 80కిపైగా కేసులు

ABN , First Publish Date - 2020-06-07T00:55:55+05:30 IST

అస్సాంలో కొత్తగా 80కిపైగా కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీనికి సంబంధించి...

కరోనా రిపోర్ట్: అస్సాంలో కొత్తగా 80కిపైగా కేసులు

దిస్‌పుర్: అస్సాంలో కొత్తగా 80కిపైగా కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీనికి సంబంధించి ఓ నివేదిక విడుదల చేసింది. దాని ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 81 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలుపుకొని రాష్ట్రంలోని మొత్తం కేసుల సంఖ్య 2,324కు చేరింది. వీరిలో 509 మంది కోలుకుని డిశ్జార్జ్ కాగా 1,808 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇదిలాఉంటే కరోనా కారణంగా ఇప్పటివరకు రాష్ట్రంలో నలుగురు మరణించారు.

Updated Date - 2020-06-07T00:55:55+05:30 IST