షార్ట్సర్క్యూట్తో తల్లీతో సహా ఏడాది వయసున్న కూతురు సజీవ దహనం
ABN , First Publish Date - 2020-04-02T17:13:31+05:30 IST
జక్రాన్పల్లి మండలంలోని లక్ష్మాపూర్ గ్రామంలో బుధవారం సాయంత్రం షార్ట్సర్క్యూట్ జరిగి ఇంట్లో నిద్రిస్తున్న తల్లీ పడకంటి అనిత (26) కూతురు శ్రీనిత (1) మృతిచెందారు.
కొడుకుకు తీవ్ర గాయాలు, ఆస్పత్రికి తరలింపు
జక్రాన్పల్లి (నిజామాబాద్ జిల్లా) : జక్రాన్పల్లి మండలంలోని లక్ష్మాపూర్ గ్రామంలో బుధవారం సాయంత్రం షార్ట్సర్క్యూట్ జరిగి ఇంట్లో నిద్రిస్తున్న తల్లీ పడకంటి అనిత (26) కూతురు శ్రీనిత (1) మృతిచెందారు. కొడుకు శ్రీనిత్కు తీవ్ర గాయాలపాలవ్వగా చికిత్స నిమిత్తం నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు. బుధవారం సాయంత్రం ఇంట్లో కూలర్ వేసుకుని నిద్రిస్తుండగా మీటర్ వద్ద షార్ట్సర్క్యూట్ జరిగి మంటలు వ్యాపించాయి. ఇంట్లోని వస్తువులు అంటుకుని నిద్రిస్తున్న తల్లీ కూతుళ్లకు కూడా మంటలు అంటుకున్నాయి. దీంతో వారు అక్కడిక్కడే సజీవ దహన మయ్యారు. కొడుకు శ్రీనిత్ గాయాలపాలై కేకలు వేశాడు. అరుపులు విని పక్కింటి వారు స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి కరెంట్ సరఫరా నిలిపివేసి ఇంట్లోకి వచ్చేలోపే వారు మృతిచెందారు. తల్లీ కూతుళ్ల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ఆస్పత్రికి తరలించారు. గ్రామ సర్పంచ్ ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై రవికుమార్ తెలిపారు. షార్ట్సర్క్యూట్ ద్వారానే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమిక అంచనాకు వచ్చారు.