ఓ ఇంటిని అద్దెకు తీసుకున్న తల్లీకూతుళ్లు.. తరచూ కొత్తకొత్త వాళ్లు వస్తూ పోతుండటంపై చుట్టుపక్కల వారికి డౌట్.. ఆరా తీస్తే..

ABN , First Publish Date - 2021-11-09T19:42:26+05:30 IST

మేమిద్దరమే ఉంటామంటూ ఆ తల్లీ కూతుళ్లు ఇల్లు అద్దెకు తీసుకున్నారు..

ఓ ఇంటిని అద్దెకు తీసుకున్న తల్లీకూతుళ్లు.. తరచూ కొత్తకొత్త వాళ్లు వస్తూ పోతుండటంపై చుట్టుపక్కల వారికి డౌట్.. ఆరా తీస్తే..

మేమిద్దరమే ఉంటామంటూ ఆ తల్లీ కూతుళ్లు ఇల్లు అద్దెకు తీసుకున్నారు.. కొన్ని రోజుల తర్వాత తరచూ కొత్తకొత్త వాళ్లు ఆ ఇంటికి వస్తూ పోతుండేవారు.. స్థానికులకు అనుమానం వచ్చి ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది.. వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.. దాడి చేసిన పోలీసులు అక్కడ వ్యభిచారం జరుగుతున్నట్టు తెలుసుకున్నారు.. అందరినీ అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.. ఉత్తరాఖండ్‌లో దాహ్లా ప్రాంతంలో జరిగింది. 


జోగేంద్ర కౌర్, రజినీ కౌర్ అనే తల్లీకూతుళ్లు దాహ్లాలోని ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. తరచుగా అక్కడకు కొత్త వారు వస్తూ పోతుండడంతో స్థానికులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు దాడి చేసి వ్యభిచారం జరుగుతున్నట్టు నిర్ధారించుకున్నారు. అందరినీ అరెస్ట్ చేశారు. తల్లి కూతుళ్లు ఇద్దరూ మరో ముగ్గురు యువతులను అక్కడకు తీసుకొచ్చి వ్యభిచారం చేస్తున్నట్టు విచారణలో తేలింది. దీంతో మొత్తం ఐదుగురు మహిళలను, ముగ్గురు విటులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

Updated Date - 2021-11-09T19:42:26+05:30 IST