బయటకు వెళ్లిన కుటుంబ సభ్యులు ఆ విషయాన్ని గ్రహించలేకపోయారు.... ఇంటికొచ్చి ఘోరాన్ని కళ్లజూశారు!

ABN , First Publish Date - 2021-10-04T15:55:01+05:30 IST

ఏమైందో ఏమో ఆ తల్లీకొడుకులిద్దరూ...

బయటకు వెళ్లిన కుటుంబ సభ్యులు ఆ విషయాన్ని గ్రహించలేకపోయారు.... ఇంటికొచ్చి ఘోరాన్ని కళ్లజూశారు!

ఏమైందో ఏమో ఆ తల్లీకొడుకులిద్దరూ ఒకేసారి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. వీరి ఆత్మహత్యపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే ఈ ఘటన హరియాణాలోని డిఘల్ గ్రామంలో చోటుచేసుకుంది. గృహ కలహాల కారణంగానే తల్లీకొడుకులు ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంటిలో ఎవరూ లేని సమయం చూసుకుని వారు ఆత్మహత్య చేసుకున్నారు. 


బయటకు వెళ్లిన కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చి, తలుపులు తెరిచి చూసేసరికి తల్లీకొడుకుల మృతదేహాలు కనిపించాయి. వెంటనే వారు ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఢిఘల్ ప్రాంతానికి చెందిన ధర్మవీర్ భార్య సుశీల(44) వారి కుమారుడు సచిన్(24)కొంతకాలంగా ఏదో విషయమై గొడవ పడుతున్నారు. ఈ నేపధ్యంలోనే వారు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. దీనిపై వివరాలు సేకరించేందుకు పోలీసులు కుటుంబ సభ్యులను ప్రశ్నిస్తున్నారు.

Updated Date - 2021-10-04T15:55:01+05:30 IST