అనంతపురంలో దారుణం.. ప్రియుడి మోజులో పడి..

ABN , First Publish Date - 2020-08-02T21:50:46+05:30 IST

జిల్లాలోని కదిరి మండలంలో దారుణం చోటుచేసుకుంది.

అనంతపురంలో దారుణం.. ప్రియుడి మోజులో పడి..

అనంతపురం : జిల్లాలోని కదిరి మండలంలో దారుణం చోటుచేసుకుంది. ప్రియుడి మోజులో పడి కన్నబిడ్డపై తల్లి దారుణానికి ఒడిగట్టింది. కుమార్తెకు ఒళ్ళంతా  కసాయి తల్లి వాతలు పెట్టింది. పూర్తి వివరాల్లోకెళితే.. కదిరి పట్టణంలోని ఓ కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. గత కొంతకాలం క్రితం భర్త నుంచి ఆమె విడిపోయింది. అనంతరం మరొకర్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నది. అప్పట్నుంచి ప్రియుడిపై మోజుతో తన చిన్నారిని ఇబ్బంది పెడుతూ వస్తోంది.


‘అమ్మా.. మా నాన్న ఎవరు..?’ అని చిన్నారి ప్రశ్నించినందుకు తల్లి తీవ్ర ఆగ్రహానికి లోనైంది. దీంతో ‘ఏంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావ్’ అంటూ చిన్నారి ఒంటి నిండా ఆ కసాయి తల్లి వాతలు పెట్టింది. స్థానిక సమాచారం మేరకు రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆ చిన్నారిని ఐసీడీఎస్ అధికారులకు పోలీసులు అప్పగించారు.

Updated Date - 2020-08-02T21:50:46+05:30 IST