ఎంత పని చేశావ్ తల్లి.. భర్త కోప్పడ్డాడని ఐదుగురు పిల్లలను తీసుకెళ్లి.. ఇలా దారుణంగా..

ABN , First Publish Date - 2021-12-05T20:43:58+05:30 IST

ఆమెకు కొన్నేళ్ల క్రితం ఓ వ్యక్తితో వివాహం అయింది. ఈ క్రమంలోనే ఏడుగురు పిల్లలకు జన్మనిచ్చింది. అప్పటి వరకూ బాగానే సాగిన ఆమె వైవాహిక జీవితంలో.. కొద్ది రోజుల క్రితం నుంచి గొడవలు ప్రారంభమయ్యాయి. తాజా

ఎంత పని చేశావ్ తల్లి.. భర్త కోప్పడ్డాడని ఐదుగురు పిల్లలను తీసుకెళ్లి.. ఇలా దారుణంగా..

ఇంటర్నెట్ డెస్క్: ఆమెకు కొన్నేళ్ల క్రితం ఓ వ్యక్తితో వివాహం అయింది. ఈ క్రమంలోనే ఏడుగురు పిల్లలకు జన్మనిచ్చింది. అప్పటి వరకూ బాగానే సాగిన ఆమె వైవాహిక జీవితంలో.. కొద్ది రోజుల క్రితం నుంచి గొడవలు ప్రారంభమయ్యాయి. తాజాగా.. శనివారం ఉదయం కూడా ఓ విషయంలో ఆమె భర్త తనపై కోప్పడ్డాడు. దీంతో ఆమె సంచలన నిర్ణయం తీసకుంది. ఐదుగురు పిల్లలను బయటికి తీసుకెళ్లి దారుణానికి పాల్పడింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..



రాజస్థాన్‌లోని కోటా ప్రాంతానికి చెందిన బాదామ్ దేవి (40)కి శివ్‌లాల్ అనే వ్యక్తితో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ క్రమంలోనే వారు.. ఏడుగురు పిల్లలకు జన్మనిచ్చారు. కాగా.. కొద్ది కాలం క్రితం నుంచి బాదామ్ దేవి, శివ్‌లాల్ మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. తరచూ భార్యభర్తలు తగువులాకుంటూ ఉండేవారు. ఈ నేపథ్యంలోనే శనివారం ఉదయం కూడా వారిద్దరి మధ్య ఓ విషయంలో గొడవ జరిగింది. భర్త కోప్పడటంతో.. తీవ్ర మనస్తాపం చెందిన బాదామ్ దేవి.. ఐదుగురు పిల్లలను తనతోపాటు ఇంటి నుంచి బయటకు తీసుకెళ్లింది. 


అనంతరం గ్రామ శివారులో ఉన్న బావిలో పిల్లలను పడేసి.. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు విడించింది. ఆదివారం ఆమె మృతదేహం నీటిలో తేలటంతో.. గ్రామస్థులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా శివలాల్ మాట్లాడుతూ.. తన భార్య శనివారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయటికి వెళ్లిందని.. సాయంత్రం అయినా తిరిగి రాకపోవడంతో చుట్టుపక్కల వారిని వాకబు చేసినట్టు చెప్పాడు. ఇటువంటి నిర్ణయం తీసుకుంటుందని అనుకోలేదని పేర్కొన్నాడు. 




Updated Date - 2021-12-05T20:43:58+05:30 IST