మా అమ్మాయిని అమ్మేశారంటూ తల్లి పెట్టిన కేసులో ట్విస్ట్.. కుమార్తె అరెస్టు.. అసలేమైందంటే..

ABN , First Publish Date - 2021-08-30T17:04:34+05:30 IST

రాజస్థాన్‌లోని చిత్తౌడ్‌గఢ్‌లో వింత ఘటన వెలుగు చూసింది. నేహ అనే యువతి నెల రోజులైనా ఇంటకా రాలేదు. స్నేహితురాళ్లతో ఊరెళ్తున్నాన్న కుమార్తె.. ఎన్నిరోజులైనా తిరిగి రాకపోవడంతో ఆమె తల్లి మున్నీదేవి కంగారు పడింది.

మా అమ్మాయిని అమ్మేశారంటూ తల్లి పెట్టిన కేసులో ట్విస్ట్.. కుమార్తె అరెస్టు.. అసలేమైందంటే..

ఇంటర్నెట్ డెస్క్: రాజస్థాన్‌లోని చిత్తౌడ్‌గఢ్‌లో వింత ఘటన వెలుగు చూసింది. నేహ అనే యువతి నెల రోజులైనా ఇంటకా రాలేదు. స్నేహితురాళ్లతో ఊరెళ్తున్నాన్న కుమార్తె.. ఎన్నిరోజులైనా తిరిగి రాకపోవడంతో ఆమె తల్లి మున్నీదేవి కంగారు పడింది. ఆమె కోసం గాలింపు చర్యలు ప్రారంభించింది. ఇటీవల ఇంటికొచ్చిన కుమార్తెను చూసి ఏమైందని అడగ్గా.. చిత్తౌడ్‌గఢ్ చూద్దామని సీమా షేఖ్ అనే యువతితో తాను వెళ్లానని, అదే సమయంలో సీమ స్నేహితురాలు సప్నా ఖటీక్ బర్త్‌డే పార్టీ జరగడంతో అక్కడకు వెళ్లానని చెప్పింది. ఆ సమయంలో సీమా షేక్, సప్నా ఖటీక్, సాబిర్ ఖాన్ అనే ముగ్గురూ కలిసి తన పేరిట నకిలీ ఆధార్ కార్డ్ తయారు చేసినట్లు తెలిపింది. దాన్ని చూపించి తనను జయరామ్ అనే వ్యక్తికి డబ్బులు తీసుకొని అమ్మేశారని వెల్లడించింది.


కుమార్తె చెప్పిన షాకింగ్ నిజం విన్న తల్లి మున్నీదేవి ఆశ్చర్యపోయింది. ఈ విషయంలో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని చెప్పి, స్టేషన్‌కు తీసుకెళ్లింది. విషయం తెలిసిన పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. ఆ దర్యాప్తులో వాళ్లకు దిమ్మతిరిగే వాస్తవాలు తెలిశాయి. నేహా ఎవరెవరి పేర్లు చెప్పిందో వాళ్లంతా ఒక ముఠా అని, ఆ ముఠాకు రింగ్ లీడర్ అని తేలింది. వీళ్లు పెళ్లి పేరుతో యువకులను మోసం చేసే ఈ ముఠా.. సంబంధం చూపించినందుకు అబ్బాయి కుటుంబం నుంచి భారీగా డబ్బు వసూలు చేస్తుంది. ఆ డబ్బు ముందే తీసుకొని, ముఠాలోని ఒక అమ్మాయిని సదరు వ్యక్తికిచ్చి పెళ్లి చేసేస్తారు.


ముందే అనుకున్న ప్రకారం, పెళ్లయిన రెండు మూడ్రోజులకే ఆ యువతి ఇంటి నుంచి పరారైపోతుంది. నేహా ఇటీవలే అలా ఒక పెళ్లి చేసుకుంది. అయితే వెంటనే ఇంటి నుంచి పారిపోవడం కుదర్లేదు. నెల రోజులైనా కుమార్తె ఇంటికి రాకపోవడంతో ఆమె తల్లి మున్నీదేవి కంగారు పడింది. కాగా, ఇటీవలే నేహా పేరును లాడో కుమావత్‌గా మార్చి, దొంగ ఆధార్ కార్డును ఈ ముఠా తయారుచేసింది. ఆ తర్వాత జయరామ్ మాలవీయ అనే వ్యక్తికిచ్చి ఆమెకు వివాహం చేశారు. స్థానిక కోర్టులో పెళ్లికి సంబంధించిన పత్రాలన్నీ సమర్పించి మరీ పెళ్లి పూర్తిచేశారు. ఈ పెళ్లి చేసినందుకు జయరామ్ నుంచి రూ.1.10 లక్షల రూపాయలు వసూలు చేశారు. వీళ్లిద్దరూ కలిసి ఒక నెలపాటు కాపురం చేశారు. ఈ క్రమంలో ఇంటి నుంచి పారిపోవడానికి నేహ రెండు సార్లు ప్రయత్నించినట్లు తెలుస్తోంది.


ఆ తర్వాత ఆమె ఇంటి నుంచి పరారవడంత జయరామ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన సీమా షేక్, నేహా, లక్ష్మీను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠాకు దొంగ ఆధార్ కార్డులు తయారు చేసిచ్చే వ్యక్తి కోసం గాలిస్తున్నారు. మధ్యప్రదేశ్‌కు చెందిన సాబిర్ ఖాన్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ముఠా ఇలా నేహాను ఎంతమందికిచ్చి దొంగ పెళ్లిళ్లు చేశారు? ఈ ముఠాలో ఎంతమంది ఉన్నారు? అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది.

Updated Date - 2021-08-30T17:04:34+05:30 IST