ఏడాది వయసున్న కూతురు నిద్రపోయింది కదా అని పక్కనే ఉన్న గుడికి వెళ్లిందా తల్లి.. తిరిగొచ్చేసరికి ఊహించని దారుణం..!

ABN , First Publish Date - 2021-10-12T13:19:04+05:30 IST

‘నా కుమార్తెను అమ్మవారే కాపాడింది. వేడి పాలు..

ఏడాది వయసున్న కూతురు నిద్రపోయింది కదా అని పక్కనే ఉన్న గుడికి వెళ్లిందా తల్లి.. తిరిగొచ్చేసరికి ఊహించని దారుణం..!

‘నా కుమార్తెను అమ్మవారే కాపాడింది. వేడి పాలు ఆమె మీద పడివుంటే అనర్థం జరిగేది..’ ఈ మాటలు  ఏడాది బాలిక తల్లి నోటి నుంచి వెలువడ్డాయి. ప్రమాదంలో గాయపడిన చిన్నారిని ఆమె ఛతర్పూర్(మధ్యప్రదేశ్)లోని ఆసుపత్రికి తీసుకువెళ్లింది. చికిత్స అందించిన వైద్యులు ఆ చిన్నారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపారు. ఆ చిన్నారి శరీరంపై కొన్ని చోట్ల వేడిపాలు పడ్డాయి. ఈ ఉదంతం జనక్‌పూర్ గ్రామంలో చోటుచేసుకుంది. రాహుల్, ప్రభా కుశావహ్‌ల ఏడాది కుమార్తె రష్మిపై వేడిపాలు పడటంతో గాయపడింది. వెంటనే తల్లిదండ్రులు ఆ చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చిన్నారిని బర్న్స్ వార్డులో ఉంచారు. ఈ సందర్భంగా ప్రభ మాట్లాడుతూ.. తాను పాలు కాచిన తరువాత ఆ పాత్రను పైన గట్టుపై ఉంచానని, ఆ పక్కనే పాప నిద్రిస్తోందని తెలిపారు. 


పాప పడుకుంది కదా అని సమీపంలోని అమ్మవారి ఆలయానికి వెళ్లాను. అక్కడ పూజలు చేస్తుండగా, ఇంటిలో నుంచి పాప అరుపులు వినిపించాయి. పరుగుపరుగున ఇంటికివెళ్లి చూసేసరికి పాపపై వేడిపాలు పడటంతో గుక్కపట్టి ఏడుస్తోంది. ఆ సమయంలో పాప చేతితో అమ్మవారి చిత్రపఠం ఉంది. వేడిపాలు అమ్మవారి చిత్రపఠంపై అధికశాతం ఒలికాయి. పాప కాలిపై కూడా కొద్దిమేరకు వేడి పాలు పడ్డాయి. ఈ సమయంలో అమ్మవారే పాపను కాపాడింది. లేకపోతే మరింత అనర్థం జరిగివుండేదని తెలిపారు. 

Updated Date - 2021-10-12T13:19:04+05:30 IST