ఇద్దరు బిడ్డలతో తల్లి అదృశ్యం

ABN , First Publish Date - 2020-11-19T12:19:51+05:30 IST

ఇద్దరు బిడ్డలతో తల్లి అదృశ్యం

ఇద్దరు బిడ్డలతో తల్లి అదృశ్యం

హైదరాబాద్/బాలానగర్‌ : ఇద్దరు బాలికలు, తల్లి అదృశ్యమయ్యారు.  భీముడు నాయక్‌, భార్య సీత ఇద్దరు కూతుళ్లు(శిరీష, గౌరీ), ఒక కుమారుడితో కలిసి ఫతేనగర్‌ అమృతాండలో నివాసముంటున్నాడు. డ్రైవర్‌గా పని చేస్తూ భార్యా పిల్లలను పోషిస్తున్నాడు. ఈ నెల 11న రాత్రి అందరూ భోజనం చేసి పడుకున్నారు. మరుసటి రోజు లేచి చూసే సరికి భార్య, కూతుళ్లు కనిపించలేదు. స్నేహితులు బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో బుధవారం బాలానగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తులో ఉంది.

Updated Date - 2020-11-19T12:19:51+05:30 IST