ఇద్దరు బిడ్డలతో తల్లి అదృశ్యం
ABN , First Publish Date - 2020-11-19T12:19:51+05:30 IST
ఇద్దరు బిడ్డలతో తల్లి అదృశ్యం
హైదరాబాద్/బాలానగర్ : ఇద్దరు బాలికలు, తల్లి అదృశ్యమయ్యారు. భీముడు నాయక్, భార్య సీత ఇద్దరు కూతుళ్లు(శిరీష, గౌరీ), ఒక కుమారుడితో కలిసి ఫతేనగర్ అమృతాండలో నివాసముంటున్నాడు. డ్రైవర్గా పని చేస్తూ భార్యా పిల్లలను పోషిస్తున్నాడు. ఈ నెల 11న రాత్రి అందరూ భోజనం చేసి పడుకున్నారు. మరుసటి రోజు లేచి చూసే సరికి భార్య, కూతుళ్లు కనిపించలేదు. స్నేహితులు బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో బుధవారం బాలానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తులో ఉంది.