విశాఖకు చెందిన ఓ మహిళ.. భర్త కోసం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో పోరాటం.. అసలేం జరిగిందంటే..

ABN , First Publish Date - 2021-10-02T21:15:39+05:30 IST

ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత కొన్ని కారణాల వల్ల ఆమె భర్తకు దూరమైంది. ఫ్యాషన్ డిజైనర్‌గా పని చేస్తూ.. వచ్చిన డబ్బులతో పిల్లలను చూసుకుంటున్న ఆమె జీవితంలోకి ఓ వ్యక్తి ఎంట్రీ ఇచ్చాడు. ఇద్దరి మధ్య పరిచయం.. ప్రేమగా మారింది. ఈ క్రమంలో పెళ్లి బంధంతో ఒక్కటవ్వాలని అనుకున్నారు. ఆమెతో పెళ్లి కోసం.. అతడు తన మతాన్ని కూడా మార్చుకున్నాడు. కొ

విశాఖకు చెందిన ఓ మహిళ.. భర్త కోసం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో పోరాటం.. అసలేం జరిగిందంటే..

ఇంటర్నెట్ డెస్క్: ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత కొన్ని కారణాల వల్ల ఆమె భర్తకు దూరమైంది. ఫ్యాషన్ డిజైనర్‌గా పని చేస్తూ.. వచ్చిన డబ్బులతో పిల్లలను చూసుకుంటున్న ఆమె జీవితంలోకి ఓ వ్యక్తి ఎంట్రీ ఇచ్చాడు. ఇద్దరి మధ్య పరిచయం.. ప్రేమగా మారింది. ఈ క్రమంలో పెళ్లి బంధంతో ఒక్కటవ్వాలని అనుకున్నారు. ఆమెతో పెళ్లి కోసం.. అతడు తన మతాన్ని కూడా మార్చుకున్నాడు. కొద్ది రోజుల వరకూ వారి కాపురం బాగానే సాగింది. అనంతరం సొంత ఊరిలో ఇల్లు కట్టాలంటూ డబ్బుతో బయల్దేరిన అతడు.. అకస్మాత్తుగా కాంటాక్ట్‌లో లేకుండా పోయాడు. ఈ నేపథ్యంలో ఆమె కీలక నిర్ణయం తీసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..


విశాఖపట్నానికి చెందిన మమతకు కొద్ది రోజుల క్రితం కొన్ని కారణాల వల్ల భర్త నుంచి విడిపోయింది. అప్పటి నుంచి ఫ్యాషన్ డిజైనింగ్ ద్వారా వచ్చిన డబ్బులతో ఆమె తన ఇద్దరు పిల్లలను చూసుకుంటోంది. ఈ క్రమంలోనే ఆమెకు 2017లో గోరఖ్‌పూర్‌కు చెందిన హబీబుల్లా పరిచయం అయ్యాడు. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారి.. పెళ్లి బంధంతో వారు ఒకటయ్యారు. పెళ్లికి ముందు మతం మార్చుకున్న హబీబుల్లా.. ఆ తర్వాత మమత పేరును మమిషా ఖాన్‌గా మార్చేశాడు. అయితే ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోకపోవడంతో కొన్నాళ్ల వరకు వారి కాపురం బాగానే సాగింది. ఈ క్రమంలో హబీబుల్లా.. గోరఖ్‌పూర్‌లో కడుతున్న ఇంటి పనుల కోసం డబ్బులు కావాలని.. ఆ పనులు పూర్తైన తర్వాత అందరం అక్కడికే వెళ్దాం అంటూ నమ్మబలికాడు. 



దీంతో మమత దాదాపు రూ.12లక్షలను అతడి చేతిలో పెట్టింది. లక్షల రూపాలయతో గోరఖ్‌పూర్ బయల్దేరిన హబీబుల్లా.. ఆ తర్వాత మమతతో కాంటాక్ట్‌లో లేకుండా పోయాడు. ఎప్పటికైనా తిరిగొస్తాడంటూ ఇంత కాలం ఎదురు చూసిన ఆమె..తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. హబీబుల్లాను వెతుకుంటూ ఇద్దరు పిల్లలతో సహా గోరఖ్‌పూర్ బయల్దేరింది. అనంతరం అక్కడి పోలీసులను ఆశ్రయించింది. అయితే అక్కడి పోలీసులు ఆమెకు సహకరించలేదు. ఈ నేపథ్యంలో ఆమె తన గోడును మీడియా ముందు వెల్లబోసుకుంది. కాగా.. ఈ ఘటన స్థానికంగా ప్రస్తుతం చర్చనీయాంశం అయింది. 


Updated Date - 2021-10-02T21:15:39+05:30 IST