కన్నబిడ్డను విక్రయించిన తల్లి..

ABN , First Publish Date - 2020-11-21T16:39:19+05:30 IST

గుంటూరు: చంద్రయ్యనగర్‌లో అమానుషం చోటు చేసుకుంది. పుట్టి వారం రోజులు కూడా గడవక ముందే శిశువును రూ.75 వేలకు తల్లి లక్ష్మీగాయత్రి అమ్మేసింది.

కన్నబిడ్డను విక్రయించిన తల్లి..

గుంటూరు: చంద్రయ్యనగర్‌లో అమానుషం చోటు చేసుకుంది. పుట్టి వారం రోజులు కూడా గడవక ముందే శిశువును రూ.75 వేలకు తల్లి లక్ష్మీగాయత్రి అమ్మేసింది. లక్ష్మీ గాయత్రి కొద్ది రోజుల క్రితం భర్త నుంచి విడిపోయి మరొకరితో సహజీవనం చేస్తోంది. వారం క్రితం జీజీహెచ్‌లో లక్ష్మీ గాయత్రి పాపకు జన్మనిచ్చింది. సత్యవతి అనే బ్రోకర్ ద్వారా శిశువును అమ్మేసింది. వలంటీర్ ద్వారా విషయం తెలసుకున్న చైల్డ్ లైన్ ప్రతినిధులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాపను ట్రేస్ చేసి చైల్డ్ లైన్ ప్రతినిధులకు పోలీసులు అప్పగించారు.  


Updated Date - 2020-11-21T16:39:19+05:30 IST