జీవితంపై విరక్తి చెంది గుళికలు తిని తల్లి, కుమారుడు మృతి
ABN , First Publish Date - 2020-07-08T21:12:21+05:30 IST
మండలంలోని గాదరాడ గ్రామానికి చెందిన తల్లీకొడుకులు..
కోరుకొండ(తూర్పు గోదావరి): మండలంలోని గాదరాడ గ్రామానికి చెందిన తల్లీకొడుకులు మంగళవారం గుళికలు తిని మృతిచెందారు. ఎస్ఐ పి.విజయ్కుమార్ వివరాల ప్రకారం... బేగపాటి నవరత్నం (83) అనారోగ్యంతో సంవత్సరకాలంగా మంచంపైనే ఉంది. ఆమె కుమారుడు ప్రకాశం (54) మూడునెలలుగా మతిస్థిమితం లేక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీంతో వీరిద్దరూ జీవితంపై విరక్తి చెంది మంగళవారం గుళికలు తిన్నారు. వారిని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కోరుకొండ పీహెచ్సీకి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.