Assam: కిడ్నీ రాకెట్లో తల్లీకొడుకు అరెస్ట్!
ABN , First Publish Date - 2021-07-13T16:56:33+05:30 IST
అసోంలోని గువాహటి జిల్లా పోలీసులు...
గువాహటి: అసోంలోని గువాహటి జిల్లా పోలీసులు కిడ్నీ రాకెట్ను ఛేదించారు. పోలీసులకు అందిన పలు ఫిర్యాదుల మేరకు పోలీసులు కిడ్నీ రాకెట్ నడుపుతున్న తల్లీకొడుకులను అరెస్ట్ చేశారు. పోలీసులకు అందిన ఒక ఫిర్యాదులో.. బాధితుడు తన కిడ్నీకి బదులుగా ఆ తల్లీకొడుకులు ఆరు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారని పేర్కొన్నాడు. అయితే తన కిడ్నీ తీసుకున్న తరువాత తనకు 50 వేల రూపాయలు మాత్రమే తనకు ఇచ్చారని ఆ వ్యక్తి ఆరోపించాడు.
వారిద్దరూ తనకు ఆపరేషన్ చేయించి, కిడ్నీ తీసుకున్నారని అతను పేర్కొన్నాడు. ఈ సందర్భంగా జిల్లా పోలీసు ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ ఈ కిడ్నీ రాకెట్కు సంబంధించి ఇప్పటి వరకూ ఆరు ఫిర్యాదులు అందాయని, వీటిపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. కాగా నిందితురాలు కొందరు వ్యక్తులను సంప్రదించి, కిడ్నీలకు బదులుగా పెద్ద మొత్తంలో డబ్బు ఆశ చూపిస్తుంటుందని పోలీసులు పేర్కొన్నారు. కోల్కతాలోని ఒక సంస్థలో ఈ మహిళ పనిచేస్తున్నదని పోలీసులు విచారణలో తేలింది.