ఎన్టీఆర్కు నివాళులర్పించిన బీజేపీ నేత మోత్కుపల్లి
ABN , First Publish Date - 2020-05-28T16:59:57+05:30 IST
హైదరాబాద్: నేడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్లో బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు నివాళులర్పించారు.
హైదరాబాద్: నేడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్లో బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు నివాళులర్పించారు. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడ్తానని జగన్ మాట తప్పాడన్నారు. డాక్టర్ సుధాకర్ను అవమానించటం దళితులను అవమానించిట్లేనని పేర్కొన్నారు. డాక్టర్ సుధాకర్పై ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. జగన్ గెలుపులో తన కృషి కూడా ఉందని మోత్కుపల్లి పేర్కొన్నారు.
జగన్ గెలవాలని కాలి నడకన తిరుమల కొండ ఎక్కానన్నారు.కృష్ణా జిల్లాకు వెంటనే ఎన్టీఆర్ పేరు పెట్టాలన్నారు. ఎన్టీఆర్ జయంతి, వర్థంతి కార్యక్రమాలను ప్రభుత్వం అధికారికంగా చేయాలని కేసీఆర్ను కోరుతున్నానన్నారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టకుంటే.. కేసీఆర్ ఎక్కడని ప్రశ్నించారు.బీజేపీ అధికారంలోకి వస్తే.. ఎన్టీఆర్ జయంతి, వర్థంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహిస్తామని మోత్కుపల్లి తెలిపారు.