దళితబంధును అడ్డుకుంది బీజేపీనే: మోత్కుపల్లి

ABN , First Publish Date - 2021-10-19T18:55:57+05:30 IST

హుజూరాబాద్‌లో దళిత బంధు అమలును బీజేపీనే అడ్డుకుందని టీఆర్ఎస్ నేత మోత్కుపల్లి అన్నారు.

దళితబంధును అడ్డుకుంది బీజేపీనే: మోత్కుపల్లి

యాదాద్రి-భువనగిరి: హుజూరాబాద్‌లో దళిత బంధు అమలును బీజేపీనే అడ్డుకుందని టీఆర్ఎస్ నేత మోత్కుపల్లి నర్సింహులు విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్ని కుట్రలు చేసినా హుజురాబాద్‌లో టీఆర్ఎస్ గెలుపును అడ్డుకోలేరన్నారు. దళిత బంధును అడ్డుకున్న ఈటెలను అడుగడుగునా అడ్డుకోవాలని పిలుపు ఇచ్చారు. దేశమే సీఎం కేసీఆర్ బాటలో నడిచే రోజు రాబోతుందన్నారు. దళితబంధు కొత్త పథకం కాదని, ఏడాది క్రితమే అమలైందన్నారు. కులరహిత సమాజం, ఆర్థిక ఇబ్బందులు లేని సమాజం కోసం పరితపించే ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ అని మోత్కుపల్లి కొనియాడారు. కేసీఆర్‌ను ఆదర్శంగా తీసుకుని దేశమంతా దళితబంధు అమలు చేయాలన్నారు.

Updated Date - 2021-10-19T18:55:57+05:30 IST