కొత్త సిరీస్లో Motorola స్మార్ట్ఫోన్స్..
ABN , First Publish Date - 2021-08-12T22:47:12+05:30 IST
ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ మోటరోలా తమ కస్టమర్లను ఆకట్టుకునేందుకు సరికొత్త మోడళ్లలో స్మార్ట్ఫోన్లను అందుబాటులోకి తెచ్చింది. భారత మార్కెట్లో సరికొత్త ఫీచర్లతో మోటొరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్, మోటొరోలా ఎడ్జ్ 20 స్మార్ట్ఫోన్లను ఆగస్టు 17వ తేదీన విడుదల చేయనున్నట్లు సంస్థ తెలిపింది.
న్యూఢిల్లీ: ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ మోటరోలా తమ కస్టమర్లను ఆకట్టుకునేందుకు సరికొత్త మోడళ్లలో స్మార్ట్ఫోన్లను అందుబాటులోకి తెచ్చింది. భారత మార్కెట్లో సరికొత్త ఫీచర్లతో మోటొరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్, మోటొరోలా ఎడ్జ్ 20 స్మార్ట్ఫోన్లను ఆగస్టు 17వ తేదీన విడుదల చేయనున్నట్లు సంస్థ తెలిపింది. అయితే ఫోన్ల విడుదలకు ముందే కొన్ని ఫీచర్స్ లీకయ్యాయి. రెండు వేరియంట్లలో మోటొరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్ ఫోన్ రానుంది. రెండు ఫోన్లకు సంబంధించిన ధరలు లీకయ్యాయి. మోటొరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్ స్మార్ట్ఫోన్ రూ. 21,000, మోటొరోలా ఎడ్జ్ 20 స్మార్ట్ఫోన్ రూ.30,000 తెలుస్తోంది. గత నెలలో యూరోపియన్ మార్కెట్లో మూడు మోడళ్లలో మోటొరోలా ఎడ్జ్ 20 సిరీస్ స్మార్ట్ఫోన్లను విడుదల చేసినట్లు సంస్థ తెలిపింది. మోటొరోలా ఎడ్జ్ 20, మోటొరోలా ఎడ్జ్ 20 ప్రో, మోటొరోలా ఎడ్జ్ 20 లైట్ స్మార్ట్ఫోన్లను యూరోపియన్ మార్కెట్లో ప్రవేశపెట్టినట్లు సంస్థ పేర్కొంది.
భారత మార్కెట్లో మోటొరోలా ఎడ్జ్ 20, మోటొరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్ స్మార్ట్ఫోన్ల ధరలు ఇలా ఉండే అవకాశం ఉంది.
6జీబీ, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ మోటొరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్ ఫోన్ రూ. 21,499, 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ఫోన్ రూ. 29,999 ఉంటుందని తెలుస్తోంది.