టీడీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలి

ABN , First Publish Date - 2021-10-23T05:05:47+05:30 IST

సీఎం జగన్‌ను తిడితే ప్రజలు తిరగబడడం ఖాయమని, టీడీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలని రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ అన్నారు.

టీడీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలి

  • క్వారీమార్కెట్‌ సెంటర్‌ ప్రజాగ్రహ దీక్షలో ఎంపీ భరత్‌రామ్‌

రాజమహేంద్రవరం అర్బన్‌, అక్టోబరు 22: సీఎం జగన్‌ను తిడితే ప్రజలు తిరగబడడం ఖాయమని, టీడీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలని రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ అన్నారు. శుక్రవారం స్థానిక క్వారీమార్కెట్‌ సెంటర్‌లో వైసీపీ నాయకులు, కార్యకర్తలు మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజాగ్రహదీక్ష శిబిరం వద్ద ఎంపీ భరత్‌రామ్‌ మాట్లాడుతూ సీఎం జగన్‌ను ఉద్దేశించి టీడీపీ నాయకుడు పట్టాభి మాట్లాడిన దుర్భాషలపై ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు తక్షణమే ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. చంద్రబాబు చిప్‌ అప్‌డేట్‌ కాకుండా ఉండిపోయిందని, రాజకీయాల నుంచి ఆయన రిటైర్మెంట్‌ తీసుకుంటే మంచిదని అన్నారు. దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టార్‌తో కలసి రాష్ట్రంలో అల్లర్లు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పట్టాభిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు అజ్జరపు వాసు, బర్రే కొండబాబు, కొత్త విజయరాజ్యలక్ష్మి, కానుబోయిన సాగర్‌, టీకే విశ్వేశ్వరరెడ్డి, గుడాల ఆదిలక్ష్మి, గారా చంటిబాబు, సత్యవేణి పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-23T05:05:47+05:30 IST