దండం పెడతా.. వాహనాలు వదలండి..: వైసీపీ ఎంపీ

ABN , First Publish Date - 2020-05-22T09:52:17+05:30 IST

ఒకప్పుడు ఆయన పోలీస్‌ అధికారే. గత..

దండం పెడతా.. వాహనాలు  వదలండి..: వైసీపీ ఎంపీ

హిందూపురం(అనంతపురం): ఒకప్పుడు ఆయన పోలీస్‌ అధికారే. గత ఎన్నికల్లో ఎంపీ అయ్యారు. ఆయన సీఐలకు దండంపెట్టి, వేడుకున్నారు. లాక్‌డౌన్‌ సందర్భంగా సీజ్‌ చేసిన వాహనాలను వదలాలంటూ విన్నవించారు. లాక్‌డౌన్‌లో వన్‌టౌన్‌, టూటౌన్‌, రూరల్‌ స్టేషన్లలో దాదాపు వెయ్యి వాహనాలు సీజ్‌ చేశారు. అవి పోలీస్‌స్టేషన్‌ ఆవరణాల్లో ఎండకు ఎండుతున్నాయి. దీంతో నిత్యం ప్రజలు, స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందనీ, జరిమానా వేసి వాహనాలు వదిలేయాలని దండం పెట్టి, వేడుకున్నారు ఎంపీ మాధవ్‌. అయినా వారు వినలేదు. వాహనాలు వదలడం తమ పరిధిలో లేదన్నారు. ఎస్పీ, కలెక్టర్‌ చొరవచూపితే తప్పా తామేమీ చేయలేమని చెప్పేశారు. 

Updated Date - 2020-05-22T09:52:17+05:30 IST