పూటకో పార్టీ మార్చే వ్యక్తి ఎర్రబెల్లి: ఎంపీ అర్వింద్

ABN , First Publish Date - 2021-07-10T03:10:26+05:30 IST

జిల్లాలోని కోరుట్ల పట్టణంలో బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. సమావేశానికి

పూటకో పార్టీ మార్చే వ్యక్తి ఎర్రబెల్లి: ఎంపీ అర్వింద్

జగిత్యాల: జిల్లాలోని కోరుట్ల పట్టణంలో బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. సమావేశానికి ఎంపీలు ధర్మపురి అర్వింద్, సోయం బాపురావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ అర్వింద్ మాట్లాడుతూ పూటకో పార్టీ మార్చే వ్యక్తి ఎర్రబెల్లి దయాకర్ రావు అని అన్నారు. బీజేపీ గురించి మాట్లాడే అర్హత ఎర్రబెల్లికి లేదన్నారు. నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రిలో 80 శాతం స్టాఫ్‌ లేదని ఎంపీ ధర్మపురి అర్వింద్ పేర్కొన్నారు. 

Updated Date - 2021-07-10T03:10:26+05:30 IST