తండ్రీ కొడుకులకు ఆ అర్హత లేదు: ఎంపీ అర్వింద్

ABN , First Publish Date - 2021-12-24T21:42:32+05:30 IST

తండ్రీ కొడుకులకు హిందువులమని చెప్పుకునే అర్హత లేదని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లపై బీజేపీ నిజామాబాద్ ఎంపీ అర్వింద్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

తండ్రీ కొడుకులకు ఆ అర్హత లేదు: ఎంపీ అర్వింద్

హైదరాబాద్:  తండ్రీ కొడుకులకు హిందువులమని చెప్పుకునే అర్హత లేదని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లపై బీజేపీ నిజామాబాద్ ఎంపీ అర్వింద్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం భైంసా అల్లర్ల బాధితులను సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రిలో పరామర్శించారు.  ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్, కేటీఆర్‌లు ఎంఐఎంకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కల్వకుంట్ల కుటుంబం చేష్టలు చూసి లక్ష్మీనర్సింహ స్వామి కూడా తల దించుకుంటున్నారని ఆవేదన వ్య క్తం చేశారు.  గో రక్షకులపై అక్రమ కేసులు పెట్టి  వేధించటం సిగ్గుచేటన్నారు.  దొంగ కేసులతో టీఆర్ఎస్ ప్రభుత్వం పీడీ యాక్టులు నమోదు చేస్తోందని అర్వింద్ ధ్వజమెత్తారు. 

Updated Date - 2021-12-24T21:42:32+05:30 IST