నాపై దాడి చేసిన వారంతా టీఆర్ఎస్ నేతలే: ఎంపీ అర్వింద్
ABN , First Publish Date - 2022-01-26T18:37:07+05:30 IST
తనపై దాడికి కారణం ఎమ్మెల్యే జీవన్రెడ్డి, సీపీ అని, దాడి చేసిన వారంతా టీఆర్ఎస్ నేతలేనని అర్వింద్ అన్నారు.
హైదరాబాద్: నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ వాహనంపై టీఆర్ఎస్ శ్రేణులు రాళ్లతో దాడి చేసిన విషయం తెలిసిందే. దీనిపై బుధవారం అర్వింద్ మీడియాతో మాట్లాడుతూ తనపై దాడికి కారణం ఎమ్మెల్యే జీవన్రెడ్డి, సీపీ అని, దాడి చేసిన వారంతా టీఆర్ఎస్ నేతలేనన్నారు. దాడి జరిగిన స్థలంలో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఉన్నారని, పోలీసులకు ముందస్తు సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదని మండిపడ్డారు. రాళ్లు, రాడ్లతో దాడులకు పాల్పడ్డారని తెలిపారు. గంజాయి ముఠా వెనుక ఎమ్మెల్యే జీవన్రెడ్డి ఉన్నారని అర్వింద్ ఆరోపించారు.