బీజేపీ వాళ్లు చిన్నపిల్లలు: అసదుద్దీన్

ABN , First Publish Date - 2021-03-09T20:15:04+05:30 IST

బీజేపీ వాళ్లు చిన్నపిల్లలు ఏమైనా అంటారని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఎద్దేవా చేశారు.

బీజేపీ వాళ్లు చిన్నపిల్లలు: అసదుద్దీన్

హైదరాబాద్: బీజేపీ వాళ్లు చిన్నపిల్లలు ఏమైనా అంటారని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఎద్దేవా చేశారు. మంగళవారం అసదుద్దీన్ ఓవైసీ రాజేంద్రనగర్ సర్కిల్ శాస్త్రీపురంలోని తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..  భైంసా అల్లర్లపై ప్రభుత్వం కచ్చితమైన చర్యలు తీసుకోవాలని ఆశిస్తున్న.. తెలంగాణ సర్కార్‌కి విన్నవిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు పరిణామాలు చోటు చేసుకోకుండా గట్టి చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ అవసరం.. అది ఏ ప్రాంతం అయిన ఏ రాష్ట్రం అయిన అందరూ కలిసి మెలసి ఉండాలన్నారు.


మజ్లిస్‌పై తనపై కొంతమంది బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద ముస్లింలను కాపడుకుంటామని స్పష్టం చేశారు. ఉమ్మడి అదిలాబాద్ ప్రాంతాలపై పోలీస్ పర్యవేక్షణ ఉండాలని గతం నుంచి తాము చెపుతున్నామన్నారు. భైంసాలోనే ఒక్కచోట ఎందుకు అల్లర్లు జరుగుతున్నాయన్నారు. తెలంగాణ  అంతటా లా అండ్ ఆర్డర్ బాగానే ఉందని చెప్పారు. ఆదిలాబాద్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల్లో ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరారు. ఆదిలాబాద్, నిజామాబాద్‌లో తప్ప మరెక్కడా అల్లర్లు లేవని చెప్పారు. మజ్లిస్ శాంతిని కోరుకుంటుంది. ముస్లింలో ఉన్న పేదలను కాపాడుకుంటుందని అసదుద్దీన్ ఓవైసీ పేర్కొన్నారు.

Updated Date - 2021-03-09T20:15:04+05:30 IST