బైంసా సీఐని సస్పెండ్ చేయాలి
ABN , First Publish Date - 2021-03-10T22:07:43+05:30 IST
బైంసా పట్టణంలోని స్థానిక సీఐ వేణుగోపాల్ను సస్పెండ్ చేయాలని
హైదరాబాద్: బైంసా పట్టణంలోని స్థానిక సీఐ వేణుగోపాల్ను సస్పెండ్ చేయాలని డీజీపీని కోరామని ఎంపీ సోయం బాపురావు తెలిపారు. ఈ రోజు డీజీపీని కలిసి బైంసా ఘటనపై బీజేపీ నేతలు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా సోయం మాట్లాడుతూ బైంసా ఘటనకు సూత్రదారులయిన మున్సిపల్ వైస్ చైర్మన్, స్థానిక కౌన్సిలర్ మహారాష్ట్రలోని ఒక గ్రామం నుంచి వెలివేయబడిన వారని ఆయన తెలిపారు. మహారాష్ట్రలో వెలివేయబడిన వారు బైంసాలో కౌన్సిలర్లుగా చెలామణి అవుతున్నారని ఆయన ఆరోపించారు.
ఎంఐఎం, టీఆర్ఎస్ ప్రోద్బలంతోనే బైంసాలో మత ఘర్షణలు జరిగాయని ఆయన విమర్శించారు. బైంసాలో హిందువులపై దాడులు సాధారణంగా మారాయని ఎంపీ బాపురావు ఆరోపించారు. డీజీపీని కలిసిన వారిలో ఎంపీలు సోయం, ధర్మపురి అరవింద్, రాజాసింగ్, వివేక్, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తదితరులు ఉన్నారు.