కరోనా నుంచి కోలుకున్న మధ్యప్రదేశ్ సీఎం.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్

ABN , First Publish Date - 2020-08-05T18:40:11+05:30 IST

కరోనా నుంచి కోలుకున్న మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ బుధవారం నాడు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

కరోనా నుంచి కోలుకున్న మధ్యప్రదేశ్ సీఎం.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్

భోపాల్: కరోనా నుంచి కోలుకున్న మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ బుధవారం నాడు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆయన 11 రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందారు. డిశ్చార్జ్ అనంతరం వారం రోజుల పాటు హోం క్వారంటైన్‌లో గడపాల్సిందిగా డాక్టర్లు ఈ సందర్భంగా సీఎంకు సూచించారు. జులై 25న శివరాజ్ సీంగ్ చౌహాన్ కరోనా బారిన పడ్డట్టు వెల్లడైన విషయం తెలిసింది. అనంతరం.. డాక్టర్ల సూచన మేరకు ఆయన ఆస్పత్రిలో చేరారు. కాగా.. ఆదివారం నాడు సీఎం తన ఆరోగ్యం విషయమై ట్వీటర్ ద్వారా స్పందించారు. తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని, తనలో కరోనా లక్షణాలేవీ లేవని ఆయన తెలిపారు. మరోసారి జరిపే కరోనా టెస్టులో నెగెటివ్ వస్తే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవుతానని ఆయన వెల్లడించారు. 

Updated Date - 2020-08-05T18:40:11+05:30 IST