నేను ఏ పార్టీలో ఉన్నానో నాకే తెలియదు: ఎంపీ డి.శ్రీనివాస్‌

ABN , First Publish Date - 2021-07-17T02:53:48+05:30 IST

రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "నేను ఇప్పుడు

నేను ఏ పార్టీలో ఉన్నానో నాకే తెలియదు: ఎంపీ డి.శ్రీనివాస్‌

నిజామాబాద్: రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "నేను ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నానో నాకే తెలియదు" అని డి.శ్రీనివాస్‌ అన్నారు. ఒక కొడుకు అర్వింద్ బీజేపీలో ఎంపీగా ఉండడం, మరో కొడుకు సంజయ్ కాంగ్రెస్‌లో చేరతాననడంతో ఆయన స్పందించారు. "నా ఇద్దరు కొడుకులు నాకు రెండు కళ్ళు" అని డీఎస్‌ పేర్కొన్నారు. తన ఇద్దరు కొడుకులు ఏ పార్టీలో ఉన్నా సమాజ సేవలో ఉండాలనే కోరుకుంటా అని డీఎస్‌ అభిప్రాయపడ్డారు. "కూర్చుండి చక్రం తిప్పగలిగిన సత్తాను దేవుడు నాకు ఇచ్చాడు" అని డీఎస్‌ అన్నారు. 

Updated Date - 2021-07-17T02:53:48+05:30 IST