పీఎం సహాయ నిధికి ఎంపీ విరాళం

ABN , First Publish Date - 2020-03-30T09:24:18+05:30 IST

కరోనా వైరస్‌ నివారణకు లోక్‌సభ స్పీకర్‌ ఇచ్చిన పిలుపు మేరకు ఆదివారం నాడు ప్రధాన మంత్రి సహాయ

పీఎం సహాయ నిధికి ఎంపీ విరాళం

భీమవరం టౌన్‌/అర్బన్‌, మార్చి 29 : కరోనా వైరస్‌ నివారణకు లోక్‌సభ స్పీకర్‌ ఇచ్చిన పిలుపు మేరకు ఆదివారం నాడు ప్రధాన మంత్రి సహాయ నిధికి తన ఎంపీ నిధుల నుంచి 2కోట్లు 7లక్షల రూపాయలు ఇచ్చినట్లు పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పార్లమెంట్‌ సభ్యుడు కనుమూరి రఘురామకృష్ణంరాజు తెలిపారు.


ఇప్పటికే కరోనా వైరస్‌ని ఎదుర్కొనేందుకు ప్రధాన మంత్రి సహాయ నిధికి వ్యక్తిగతంగా రూ.10లక్షలు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.10లక్షలు అందించానన్నారు. నరసాపురం పార్లమెంట్‌ పరిధిలో కరోనా వైరస్‌ నివారణకు సంబంధిత వైద్య పరికరాలు కొనుగోలుకు తన ఎంపీ నిధుల నుంచి కోటి రూపాయలు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌ ముత్యాలరాజుకి అందించినట్టు తెలిపారు.

Updated Date - 2020-03-30T09:24:18+05:30 IST