గ్రామాల అభివృద్ధికి ఎంపీ నిధులు

ABN , First Publish Date - 2022-01-29T04:33:47+05:30 IST

గ్రామాల అభివృద్ధికి ఎంపీ నిధులు

గ్రామాల అభివృద్ధికి ఎంపీ నిధులు
ఎంపీకి వినతిపత్రం అందజేస్తున్న ప్రజాప్రతినిధులు

చేవెళ్ల, జనవరి 28: మండలంలోని ఈర్లపల్లి, ఎన్కెపల్లి, గొల్లగూడ గ్రామాలకు చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి నిధులు మంజూరు చేసినట్లు ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు తెలిపారు. శుక్రవారం ఎంపీని నగరంలో కలిసిన వారు తమ గ్రామాలకు నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఎంపీ మూడు గ్రామాల అభివృద్ధికి రూ.10లక్షల చొప్పున రూ.30లక్షలు మంజూరు చేస్తూ ప్రకటించినట్లు తెలిపారు. ఈసందర్భంగా ఎంపీకి వారు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో చేవెళ్ల నియోజకవర్గం టీఆర్‌ఎస్‌ పార్టీ యూత్‌ అధ్యక్షుడు వనం లక్ష్మీకాంత్‌రెడ్డి, సర్పంచులు రాంచంద్రయ్య, ఉపసర్పంచులు లక్ష్మయ్య, విఠలయ్య, నాయకులు దేవదాస్‌, గుజ్రయ్య, నర్సింహులు పాల్గొన్నారు.  

Updated Date - 2022-01-29T04:33:47+05:30 IST