చీకటిలోనూ వెలుగు నింపుదాం
ABN , First Publish Date - 2020-04-05T09:16:18+05:30 IST
ప్రపంచమంతా కరోనా వైరస్తో అంధకారం అలుముకున్న వేళ భౌతికదూరం పాటిస్తూ 9 నిమిషాల పాటు దీపం, కొవ్వొత్తి, మొబైల్ టార్చ్ వెలిగించి మనం ఒంటరి కాదనే భావం దేశ ప్రజలకు కలిగిద్దామని ఎంపీ గల్లా జయదేవ్ శనివారం పిలుపునిచ్చారు.
ఎంపీ గల్లా జయదేవ్
గుంటూరు, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి): ప్రపంచమంతా కరోనా వైరస్తో అంధకారం అలుముకున్న వేళ భౌతికదూరం పాటిస్తూ 9 నిమిషాల పాటు దీపం, కొవ్వొత్తి, మొబైల్ టార్చ్ వెలిగించి మనం ఒంటరి కాదనే భావం దేశ ప్రజలకు కలిగిద్దామని ఎంపీ గల్లా జయదేవ్ శనివారం పిలుపునిచ్చారు. ఆత్మ బలం పెంపొందించుకునేందుకు ప్రధాని మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపు మేరకు ఆదివారం రాత్రి 9 గంటలకు ఇంట్లో లైట్లు ఆర్పి దీపం వెలుగులో విజయం మనదేనని చాటుదామన్నారు. కరోనాపై స్వీయ నియంత్రణ పాటిస్తూ విజయం సాధించి ప్రపంచానికి భారతదేశ ఐక్యతా రాగాన్ని చాటిచెబుతామన్నారు.