వైసీపీకి తగిన బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది: ఎంపీ గల్లా
ABN , First Publish Date - 2021-03-02T18:21:50+05:30 IST
వైసీపీకి తగిన బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు.
గుంటూరు: వైసీపీకి తగిన బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. వైసీపీ అరాచక పాలనకు మున్సిపల్ ఎన్నికల నుంచే చరమగీతం పాడాలని తెలిపారు. మొన్న పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం దౌర్జన్యం అంతా ఇంతా కాదని మండిపడ్డారు. వైసీపీ దౌర్జన్యాలు చేస్తున్నా ప్రజల కోసం టీడీపీ పోరాడుతూనే ఉందని అన్నారు. వైసీపీ అధికారం రాకముందు ఎలా ఉంది, అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా ఉందనేది ప్రజలు గుర్తించారన్నారు. జగన్ ప్రభుత్వం వ్యవస్థలన్నీ బ్రష్టు పట్టించిందని ఎంపీ గల్లా జయదేవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంగళవారం తెనాలిలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఎంపీ గల్లా జయదేవ్, మాజీ మంత్రి ఆలపాటి రాజా పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగి టీడీపీ అభ్యర్థుల్ని గెలిపించాలని మాజీ మంత్రి ఆలపాటితో కలసి ఎంపీ గల్లా అభ్యర్థించారు.