నేటి నుంచి ఈ రాష్ట్రాల్లో తెరుచుకోనున్న స్కూళ్లు!

ABN , First Publish Date - 2021-07-26T11:43:10+05:30 IST

దేశంలో కరోనా సెకెండ్ వేవ్ తగ్గుముఖం...

నేటి నుంచి ఈ రాష్ట్రాల్లో తెరుచుకోనున్న స్కూళ్లు!

న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకెండ్ వేవ్ తగ్గుముఖం పట్టడంతో కరోనా ఆంక్షల నుంచి మినహాయింపులు లభించాయి. రాజధాని ఢిల్లీలో నేటి నుంచి అన్ లాక్-8 గైడ్‌లైన్స్ అమలుకానున్నాయి. ఈ నేపధ్యంలో ఈరోజు నుంచి ఢిల్లీ మెట్రో 100 శాతం సామర్థ్యంతో పరుగులు తీయనుంది. ఇప్పటివరకూ మెట్రో 50 శాతం ప్రయాణికుల సామర్ధ్యంతోనే నడిచింది. మరోవైపు దేశంలోని పలు రాష్ట్రాల్లో నేటి నుంచి స్కూళ్లు తెరుచుకోనున్నాయి. 


అయితే ఢిల్లీలో స్కూళ్లు, కాలేజీలు తెరిచేందుకు ఇంకా అనుమతులు లభించలేదు. మధ్యప్రదేశ్‌లో ఈరోజు నుంచి 11, 12 తరగతుల పాఠశాలలు తెరుచుకోనున్నాయి. ఇదేవిధంగా గుజరాత్‌లోనూ నేటి నుంచి స్కూళ్లు తెరుచుకోనున్నాయి. 9, 10, 11 తరగతుల విద్యార్థులు పాఠశాలలకు హాజరుకానున్నారు. అయితే 50 శాతం విద్యార్థుల సామర్థ్యంతోనే స్కూళ్లు తెరుచుకోనున్నాయి. ఇక ఒడిశాలోనూ నేటి నుంచి10, 12 తరగతులు ప్రారంభం కానున్నాయి. అయితే 50 శాతం విద్యార్థులు మాత్రమే హాజరయ్యేందుకు వీలు కల్పించారు. నాగాలాండ్‌లో ఈరోజు నుంచి హయ్యర్ సెకెండర్ స్కూళ్లు, కాలేజీలు తెరుచుకోనున్నాయి. అయితే వ్యాక్సిన్ వేయించుకున్న స్కూళ్ల టీచర్లు, స్టాఫ్ మాత్రమే పాఠశాలలకు రావాలనే నిబంధన విధించారు. కర్నాటకలో ఈరోజు నుంచి కాలేజీలు తెరుచుకోనున్నాయి. 

Updated Date - 2021-07-26T11:43:10+05:30 IST