ఆరేళ్లుగా పంజరంలో బందీ... మూడు గుడ్లు పెట్టిన మగ రామచిలుక!

ABN , First Publish Date - 2020-02-27T16:23:06+05:30 IST

మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో ఒక విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. ఈ సంగతి తెలిసినవారంతా నిర్ఘాంతపోతున్నారు. ఆరేళ్ల పాటు పంజరంలో బందీగా ఉన్న ఒక మగ రామచిలుక మూడు గుడ్లను పెట్టింది.

ఆరేళ్లుగా పంజరంలో బందీ... మూడు గుడ్లు పెట్టిన మగ రామచిలుక!

జబల్‌పూర్: మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో ఒక విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. ఈ సంగతి తెలిసినవారంతా నిర్ఘాంతపోతున్నారు.  ఆరేళ్ల పాటు పంజరంలో బందీగా ఉన్న ఒక మగ రామచిలుక మూడు గుడ్లను పెట్టింది. ఆ రామచిలుకను పెంచుతున్న దాని యజమాని సతీష్ తివారీ ఆ గుడ్లను చూసి తన గుడ్లు తేలేశారు. అయితే ఈ సమాచారం అందుకున్న వన్యప్రాణి విశేషజ్ఞులు మాట్లాడుతూ ఇదేమీ విచిత్రం కాదన్నారు. ఇటువంటి ఉదంతాలు అప్పుడప్పుడూ జరుగుతుంటాయన్నారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఆరేళ్లుగా పంజరంలోనే ఉంటున్న రామ చిలుక రెండు రోజుల వ్యవధిలో మూడు గుడ్లను పెట్టింది. వాటిలో ఒక గుడ్డును ఆ రామ చిలుకనే పగులగొట్టింది. రెండు గుడ్లు సురక్షితంగా ఉన్నాయి. కాగా మగ పక్షులు గుడ్లను పెట్టడం సహజమేనని, అయితే ఆ గుడ్ల నుంచి పిల్లలను పొదగడం జరగదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సతీష్ తివారీ ఇంట్లోని రామచిలుక పెట్టిన గుడ్ల నుంచి పిల్లలు పుట్టవని తెలిపారు. 


Updated Date - 2020-02-27T16:23:06+05:30 IST