బీజేపీ దెబ్బకు సీఎం కేసీఆర్ ఫాం హౌస్ వదిలిండు: మాజీ ఎంపీ

ABN , First Publish Date - 2021-08-01T21:20:40+05:30 IST

బీజేపీ దెబ్బకు సీఎం కేసీఆర్ ఫాం హౌస్ వదిలిండు: మాజీ ఎంపీ

బీజేపీ దెబ్బకు సీఎం కేసీఆర్ ఫాం హౌస్ వదిలిండు: మాజీ ఎంపీ

మహబూబ్‌నగర్‌: జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడుగా వీరభ్రహ్మాచారి బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ నేత మాజీ ఎంపీ జితేందర్‌ రెడ్డి హాజరైయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బీజేపీలోనే తాను క్రమశిక్షణ నేర్చుకున్నానని చెప్పారు. ఇతర పార్టీలోకి పోయివచ్చినా కూడా మంచి ఆదరణ ఉందన్నారు. జిల్లా అధ్యక్ష పదవిక వీరబ్రహ్మం చారికి పార్టీ పెట్టిన పెద్ద బాధ్యతన్నారు. గోల్కొండ ఖిల్లాపై జెండా ఎగురవేయాలన్నారు. అధికారం సాధించేందుకు చాలా దగ్గరగా వచ్చామని పేర్కొన్నారు. బీజేపీ దెబ్బకు సీఎం కేసీఆర్ ఫాం హౌస్ వదిలిండన్నారు. టీఆర్ఎస్‌వి అన్నీ దొంగ స్కీములని విమర్శించారు.


  

Updated Date - 2021-08-01T21:20:40+05:30 IST