ఎంపీ కనిమొళికి మళ్లీ Covid
ABN , First Publish Date - 2022-06-22T15:51:46+05:30 IST
డీఎంకే ఎంపీ కనిమొళి మళ్లీ కరోనా లక్షణాలతో హోం క్వారంటైన్కు వెళ్లారు. డీఎంకే మహిళా విభాగం అధ్యక్షురాలు, తూత్తుకుడి ఎంపీ కనిమొళి గత శాసనసభ ఎన్నికల
చెన్నై, జూన్ 21: డీఎంకే ఎంపీ కనిమొళి మళ్లీ కరోనా లక్షణాలతో హోం క్వారంటైన్కు వెళ్లారు. డీఎంకే మహిళా విభాగం అధ్యక్షురాలు, తూత్తుకుడి ఎంపీ కనిమొళి గత శాసనసభ ఎన్నికల సమయంలో కొవిడ్ బారిన పడ్డారు. తాజాగా, ఆమెకు మళ్లీ కరోనా లక్షణాలు నిర్ధారణ కావడంతో వైద్యుల సలహా మేరకు హోం క్వారంటైన్లో ఉన్నట్లు ఎంపీ తన ట్విట్టర్లో తెలియజేసారు.