యాసంగి ముచ్చట్లు మాట్లాడుతున్నారు...ఎంపీ కోమటిరెడ్డి

ABN , First Publish Date - 2021-11-24T01:50:29+05:30 IST

రాష్ట్రంలో పండించిన పంటలు కొనడం వదిలేసి, ఇవన్నీ

యాసంగి ముచ్చట్లు మాట్లాడుతున్నారు...ఎంపీ కోమటిరెడ్డి

నల్గొండ: రాష్ట్రంలో పండించిన పంటలు కొనడం వదిలేసి, ఇవన్నీ తప్పించుకోవడానికి యాసంగి పంటల ముచ్చట మాటలు మాట్లాడుతన్నారని సీఎం కేసీఆర్‌పై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ధ్వజమెత్తారు. మునుగోడులో సర్వసభ్య సమావేశానికి ఎంపీ  హాజరయ్యారు. అనంతరం  కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటు రాష్ట్రమే కొనాలి, అటు కేంద్రమే కొనాలి అంటూ జాప్యం చేయకుండా వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. చీఫ్ సెక్రటరీని తీసుకుని డిల్లీకి వెళ్ళిన ముఖ్యమంత్రికి మూడు రోజులుగా ఎవరు అపాయింట్మెంట్ ఇవ్వడంలేదన్నారు. ఇక్కడే ఉండి వడ్లు ఎలా కొనాలి ఆలోచించకుండా అక్కడకు వెళ్లి యాసంగి పంటల గురుంచి వెయ్యాలా వద్దా అంటూ కేంద్రం వద్ద తగువులాటకి వెళ్లినా ముఖ్యమంత్రికి ఎవ్వరూ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదన్నారు..

Updated Date - 2021-11-24T01:50:29+05:30 IST