అసలైన యుద్ధం మేం చేస్తాం: ఎంపీ కోమటిరెడ్డి
ABN , First Publish Date - 2021-11-18T00:13:57+05:30 IST
వారం లోపు వడ్లను కొనుగోలు చేయకపోతే అసలైన యుద్ధం తాము
సూర్యాపేట: వారం లోపు వడ్లను కొనుగోలు చేయకపోతే అసలైన యుద్ధం తాము చేస్తామని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. జిల్లాలోని నూతనకల్ మండలంలోని ఐకేపీ సెంటర్లలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎంపీ తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆడే డ్రామాలతో రైతులు బలవుతున్నారన్నారు. కేసీఆర్కి దమ్ముంటే ఢిల్లీలో ధర్నా చేయాలని సవాల్ విసిరారు. తెలంగాణ ధనిక రాష్ట్రం అంటున్నప్పుడు ముందుగా వడ్లని కొనుగోలు చేసి తరువాత కేంద్రంపై పోరాడాలని ఆయన సూచించారు.