దళితులతో కలిసి దీక్షలు చేస్తాం: ఎంపీ కోమటిరెడ్డి

ABN , First Publish Date - 2021-07-25T00:56:35+05:30 IST

దళితులతో కలిసి దీక్షలు చేస్తాం: ఎంపీ కోమటిరెడ్డి

దళితులతో కలిసి దీక్షలు చేస్తాం: ఎంపీ కోమటిరెడ్డి

నల్గొండ: ఎస్సెల్బీసీ ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని చెప్పిన సీఎం కేసీఆర్ నేటికీ పట్టించుకోవడం లేదని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు. హుజూరాబాద్ ఎన్నికలొచ్చాయని రూ.2 వేల కోట్లతో దళితబంధును తెరపైకి తెచ్చారని పేర్కొన్నారు. కరోనాతో చనిపోయిన కుటుంబాలను పక్క రాష్ట్రంలో ఆదుకుంటే...తెలంగాణలో కనీసం పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితబంధు ప్రతీ నియోజకవర్గంలో ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షలు ఇచ్చేలా దళితులతో కలిసి దీక్షలు చేస్తామని తెలిపారు. 

Updated Date - 2021-07-25T00:56:35+05:30 IST