నాయకుడంటే మాట ఇస్తే తప్పకూడదు: ఎంపీ కోమటిరెడ్డి
ABN , First Publish Date - 2021-10-09T01:24:21+05:30 IST
నాయకుడంటే మాట ఇస్తే తప్పకూడదని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి
హైదరాబాద్: నాయకుడంటే మాట ఇస్తే తప్పకూడదని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. గతంలో దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని చెప్పి ఇప్పుడు తాను అనలేదని సీఎం కేసీఆర్ అంటున్నారని ఆయన మండిపడ్డారు. సీఎం కేసీఆర్ది నాలుకా.. తాటి మట్టా అని ఆయన ప్రశ్నించారు. నాయకుడంటే మాట ఇస్తే తప్పకూడదన్నారు. దళితులకు కేసీఆర్ 10 లక్షలు ఇస్తారంటే నమ్ముతారా అని ఎంపీ కోమటిరెడ్డి ప్రశ్నించారు. హుజురాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్కు ప్రజలే బుద్ధి చెబుతారని ఎంపీ కోమటిరెడ్డి పేర్కొన్నారు.