నాకు కాంగ్రెస్ పార్టీలో ఎవరితో వైరుధ్యాలు లేవు: కోమటిరెడ్డి

ABN , First Publish Date - 2021-11-28T02:15:40+05:30 IST

తనకు కాంగ్రెస్ పార్టీలో ఎవరితో వైరుధ్యాలు లేవని ఏబీఎన్‌తో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడిని సందర్భంగా చెప్పారు. తమ పార్టీలో ఎవరికి ఎవరు బాసులు కారన్నారు.

నాకు కాంగ్రెస్ పార్టీలో ఎవరితో వైరుధ్యాలు లేవు: కోమటిరెడ్డి

హైదరాబాద్‌: తనకు కాంగ్రెస్ పార్టీలో ఎవరితో వైరుధ్యాలు లేవని ఏబీఎన్‌తో  ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడిని సందర్భంగా చెప్పారు. తమ పార్టీలో ఎవరికి ఎవరు బాసులు కారన్నారు. పార్టీని అధికారంలోకి తేవడనే తమ ముందున్న కర్తవ్యమన్నారు. తెలంగాణ రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. వానకాలం వరి ధాన్యం కొనకుండా.. యాసంగిపై మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ రైతులను జరుగుతున్న అన్యాయాలపై గళమెత్తుతామని తెలిపారు. పార్లమెంటు సమావేశాల్లో వరి సమస్య పై నిలదీస్తామన్నారు. టీఆర్ఎస్ ఎంపీలు రాజకీయాలు పక్కన పెట్టి తమతో కలిసి రాలన్నారు. ప్రధాని మోడీని కలుస్తాం..మంత్రులను కలుస్తామన్నారు. ఎంపీలం ముగ్గురం మాట్లాడుకుని జంతర్ మంతర్ దగ్గర దీక్షకు ప్లాన్ చేస్తామని పేర్కొన్నారు. 

Updated Date - 2021-11-28T02:15:40+05:30 IST