హుజూరాబాద్ కోసమే దళితబంధు: ఎంపీ కోమటిరెడ్డి
ABN , First Publish Date - 2021-08-09T23:06:12+05:30 IST
హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసమే రాష్ట్రంలో దళితబంధు పథకాన్ని సీఎం కేసీఆర్
నల్లగొండ: హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసమే రాష్ట్రంలో దళితబంధు పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రవేవపెట్టారని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆరోపించారు. ఎన్నికల తర్వాత అన్నీ బంద్ అంటాడని కేసీఆర్ను ఎంపీ కోమటిరెడ్డి పరోక్షంగా దెప్పి పొడిచారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్క పేదవాడికి రూ. 10 లక్షలు ఇవ్వాలని ఎంపీ కోమటిరెడ్డి డిమాండ్ చేశారు.